న్యూఢిల్లీ, డిసెంబర్ 24: విమానయాన సంస్థ ఎయిర్ఏషియా నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.1,497గా నిర్ణయించింది. ఈ నెల 25 వరకు అమలులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్తో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 లోపు ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది.
www.airasia. co.in వెబ్సైట్, కంపెనీ మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది. బెంగళూరు-కొచ్చి ఈ టిక్కెట్టు ధర వర్తించనున్నదని, ఆయా నగరాల మధ్య దూరం ఆధారంగా ధర అధికంగా ఉండనున్నదని తెలిపింది. మరోవైపు, ఇండిగో కూడా రూ.2,023కే విమాన టిక్కెట్టును ఆఫర్ చేస్తున్నది. అంతర్జాతీయంగా రూ.4,999గా నిర్ణయించింది.