బెంగళూరు, ఫిబ్రవరి 29: దేశీయ ఫ్యాషన్ దిగ్గజాల్లో ఒకటైన ఆజియో..సరికొత్తగా ఆల్ స్టార్స్ సేల్ను ప్రకటించింది. మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రత్యేక ఆఫర్ కింద 6 వేలకు పైగా బ్రాండ్స్ను 50 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది.
ఈ విక్రయ సమయంలో ఉత్తమంగా షాపింగ్ చేసిన వారిలో ప్రతి ఎనిమిది గంటలకు రూ.1,09,900 విలువైన ఐఫోన్ 15(512 జీబీ), రూ.1,49,900 ధర కలిగిన యాపిల్ మ్యాక్బుక్, రూ.1,61,999 విలువైన సామ్సంగ్ ఎస్ 23 అల్ట్రా 512 జీబీ సామర్థ్యం కలిగిన మొబైల్ను గెలుచుకునే అవకాశాన్ని కల్పించినట్లు కంపెనీ సీఈవో వినీత్ నాయర్ తెలిపారు. దీంతోపాటు ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోళ్లు జరిపిన వారికి 10 శాతం వరకు మినహాయింపు పొందవచ్చును కూడా. సంవత్సరంలో అతిపెద్ద సేల్కు శ్రీకారంచుట్టినట్టు, ఇటీవల కొత్తగా 500 బ్రాండ్స్ను చేరినట్లు తెలిపారు.