న్యూఢిల్లీ, జూన్ 6: అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ మరో మెట్టు పైకి ఎక్కారు. అదానీ గ్రూపునకు చెందిన షేర్లు భారీగా పుంజుకోవడంతో గౌతమ్ అదానీ సం పద పెరిగి ఆసియా కుబేరుల జాబితాలో తొలిస్థానం దక్కించుకున్నారు. రిలయన్స్ గ్రూపు చైర్మన్ ముకేశ్ అంబానీ స్థానాన్ని వెనక్కినెట్టి అదానీ కైవసం చేసుకున్నారు. గౌతమ్ అదానీ సంపద 2.5 బిలియన్ డాలర్లు పెరిగి 89.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. 88 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో ముకేశ్ అంబానీ ర్యాంక్ రెండో స్థానానికి పడిపోయింది. ఈ విషయాన్ని ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ లిస్ట్ విడుదల చేసిన జాబితాలో వెల్లడించింది.