న్యూఢిల్లీ: అబుదాబీ కేంద్రంగా సేవలందిస్తున్న విమానయాన సంస్థ ఎతిహాద్ ఈ నెల 10వ తేదీ నుంచి భారత్కు సేవలందించనున్నది. ఇటీవల భారత్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి అనుమతించిన వివిధ వర్గాల వారి ప్రయాణానికి అనుమతించింది. భారత్తోపాటు పాకిస్థాన్, శ్రీలంక దేశాల పౌరులకూ అనుమతి లభించింది. అయితే అబుదాబిలో ప్రవేశించిన వారు 10 రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందే.
అలాగే భారత్ నుంచి బయలుదేరడానికి ముందు నాలుగు, ఎనిమిది రోజుల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేయించుకోవడం తప్పనిసరి. వారంతా అధికారులు అందజేసే మెడికల్ అప్రూవ్డ్ రిస్ట్ బ్యాండ్ ధరించి క్వారంటైన్లో ఉండాలి.
భారత్తోపాటు శ్రీలంక, పాకిస్థాన్ తదితర ఐదు దేశాల నుంచి ఎంపిక చేసిన వర్గాల ప్రయాణికులను అనుమతించింది. వారిలో యూఏఈ రెసిడెంట్లు, మానవత్వ కోణంలో ప్రయాణించేవారు, మెడికల్ టూరిస్టులు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు.