హైదరాబాద్, మే 1: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ లాట్..ఏసీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచీలు, లాప్ట్యాప్లు, బ్రాండెడ్ యాక్సెసరీస్లతోపాటు వోల్టాస్, లాయిడ్ ఏసీ బ్రాండ్లు కూడా లభించనున్నాయని కంపెనీ డైరెక్టర్ ఎం అఖిల్ తెలిపారు.
ఈ వేసవిలో ఏసీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి కొన్ని బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తున్నట్టు, త్వరలో మరిన్ని బ్రాండ్లు కూడా అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు.