IT Returns | ముంబై, జూలై 31: ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలకు చివరిరోజైన సోమవారం సాయంత్రం 6 గంటలవరకూ 6.5 కోట్లమంది ఫైల్ చేశారు. ఇదే సమయానికి సోమవారం ఒక్క రోజునే 36.81 లక్షల రిటర్న్లు దాఖలయ్యాయని, తమ ఈ-ఫైలింగ్ పోర్టల్ను 1.78 కోట్ల మంది విజయవంతంగా లాగిన్ అయ్యారని ఐటీ శాఖ ట్వీట్ చేసింది.
ఖాతాల ఆడిటింగ్ అవసరం లేని వ్యక్తులు, సంస్థలు రిటర్న్లు ఫైల్ చేసేందుకు జూలై 31 చివరితేదీ. గత ఏడాది జూలై 31నాటికి 5.83 రిటర్న్లు దాఖలుకాగా, ఈ ఏడాది ఆ సంఖ్యను మించడం గమనార్హం. పన్ను చెల్లింపుదార్లు పెరిగినందున, ఐటీఆర్ ఫైలింగ్లో సైతం వృద్ధి కనపడుతుందని టాక్స్ నిపుణులు చెప్పారు. పన్నుల ఎగవేతను అరికట్టేందుకు ఆదాయపు పన్ను శాఖ పలు చర్యలు చేపట్టడం కూడా రిటర్న్లు వేసేవారి సంఖ్య పెరగడానికి మరో కారణమన్నారు. ఖాతాల్ని ఆడిటింగ్ జరపాల్సిన కార్పొరేట్లు, వ్యక్తులు రిటర్న్ దాఖలు చేయడానికి అక్టోబర్ 31 గడువు తేదీ.