రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రకటన
న్యూఢిల్లీ, మే 4: వ్యాక్సిన్ వేసుకున్నవారికి బీమా ప్రీమియం చెల్లింపుల్లో రాయితీలు ప్రకటిస్తున్నాయి బీమా కంపెనీలు. ఇప్పటికే పలు సంస్థలు రాయితీలు ప్రకటించగా..తాజాగా ఈ జాబితాలోకి రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ చేరింది. కొత్తగా పాలసీ కొనుగోలు చేసేవారికి, ప్రీమియం చెల్లిస్తున్న వారికి 5 శాతం రాయితీ కల్పించింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కొవిడ్-19 వ్యాక్సిన్కు మరింత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, అలాగే కస్టమర్లకు రివార్డులు కూడా ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.