న్యూఢిల్లీ : భారత్లో స్టాండర్డ్ జీప్ కంపాస్ ఎస్యూవీ అప్డేటెడ్ వెర్షన్గా కాస్మెటిక్ మార్పులు, నూతన ఫీచర్ల జోడింపుతో 2022 జీప్ కంపాస్ ట్రయల్హాక్ లాంఛ్ అయింది. న్యూ జీప్ కంపాస్ రూ 30.72 లక్షల (ఎక్స్షోరూం)కు అందుబాటులో ఉంటుంది.
లేటెస్ట్ జీప్ ఎస్యూవీ రీడిజైన్డ్ బంపర్లు, రైడ్ హైట్ పెంపు, 17 ఇంచ్ అలాయ్, ఆల్ సీజన్ టైర్లు, ట్రయల్ రేటెడ్ బ్యాడ్జింగ్ వంటి ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇక హెడ్ల్యాంప్స్, గ్రిల్ స్టాండర్డ్ కంపాస్ తరహాలోనే ఉన్నాయి.
ఇక కంపాస్ ఫేస్లిఫ్ట్ మాదిరిగానే సేమ్ డ్యాష్బోర్డ్ లేఅవుట్తో 2022 ట్రయల్హాక్ రూపొందింది. రెడ్ స్టిచ్చింగ్, సీట్లపై ట్రయల్హాక్ లోగోలు కొంత వ్యత్యాసాన్ని జోడిస్తాయి. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, 10.1 ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, 10.25 ఇంచ్ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, పానరామిక్ సన్రూఫ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.