ముంబై, ఆగస్టు 16: ఛారిటబుల్ సంస్థలు… మొబైల్ ట్యాంకర్లు లేదా టిన్స్ ద్వారా సరఫరాచేసే తాగునీటిపై 18 శాతం జీఎస్టీ ఉంటుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ రూలింగ్ (ఏఏఆర్) ఆంధ్రప్రదేశ్ బెంచ్ రూలింగ్నిచ్చింది. శుద్ధిచేసిన తాగునీటిని ప్రజలకు తక్కువ ధరపై జరిగే సరఫరాలపై జీఎస్టీ వర్తింపునకు సంబంధించి ఒక ఛారిటబుల్ సంస్థ అడ్వాన్స్ రూలింగ్ కోరగా, ఇటువంటి సరఫరాలకు జీఎస్టీ మినహాయింపు లేదని ఏఏఆర్ బెంచ్ పేర్కొంది. శుద్ధిచేసిన తాగునీటిపై 18 శాతం జీఎస్టీ ఉందని బెంచ్ రూలింగ్లో తెలిపింది.