న్యూఢిల్లీ, జనవరి 24: దేశీయ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ముడి క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ గత త్రైమాసికానికిగాను సంస్థ రూ.8,063.39 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే కాలానికి సంస్థ రూ.448.01 కోట్ల లాభం మాత్రమే గడించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ.12,967 కట్లో కంటే చాలా తక్కువగా నమోదైంది. కంపెనీ ఆదాయం రూ.2.28 లక్షల కోట్ల నుంచి రూ.2.23 లక్షల కోట్లకు పడిపోయింది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ప్రతి బ్యారెల్ క్రూడాయిల్ను శుద్ది చేయడంతో సంస్థకు 13.26 డాలర్ల ఆదాయం సమకూరింది.