అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడు విడతలుగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఘోరం ఓడి పోయింది. అధికార వైఎస్సార్సీపీ దర్శి మినహా అన్ని మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. ఏపీలో ఉన్న 12మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల కౌంటింగ్ బుధవారం నిర్వహించారు.
కుప్పం, బుచ్చిరెడ్డి పాలెం, కమలాపురం, రాజంపేట, పెనుకొండ, ఆకివీడు, బేతంచర్ల ,కొండపల్లి, దాచెపల్లి, గురజాలలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసింది. నెల్లూరు కార్పొరేషన్లో అత్యధిక స్థానాలతో ముందుకు దూసుకెళ్తుంది. జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య హోరాహోరి ఫలితాలు వస్తున్నాయి. దర్శిలో టీడీపీ విజయం సాధించింది నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్ విజయకేతనం కొనసాగుతుంది.