ముమ్మడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఏపీలోని కొనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ జిల్లాలోని అమలాపురంలో యువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇది కాస్త తీవ్ర రూపం దాల్చింది.
ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టే కొద్ది నిమిషాల ముందే నిరసనకారులు మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటికి కూడా నిప్పు పెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఎమ్మెల్యే ఇల్లు దగ్ధమైంది. పరిస్థితి ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో అమలాపురంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.