అమరావతి: ఆంధ్రప్రదేశ్లో చిరు వ్యాపారులకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని ఆయన అన్నారు. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రూ. 16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కలిపి రూ. 526.62 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. జగన్ మాట్లాడుతూ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని వారిని ఆదుకునేందుకు జగనన్న తోడు పథకం కింద వడ్డీలేని రుణాలను చిరువ్యాపారులు, హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి ఏటా రూ.10వేల చొప్పున అందిస్తున్నామని వెల్లడించారు.
సుమారు రాష్ట్రంలో 5.10లక్షల మంది చిరువ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందించి అండగా జగనన్న తోడు లక్ష్యమని పేర్కొన్నారు. దీని వల్ల లక్షల మంది చిరువ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారని జగన్ వెల్లడించారు .ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు అధికారులు పాల్గొన్నారు.