హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) ః ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో గత ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు పేరు బయటకు వస్తుందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్రెడ్డి తెలిపారు.
లోకేశ్ పాత్ర ఉందా? లేదా? అనేది సీఐడీ దర్యాప్తులో తేలుతుందన్నారు. యనమల పాత్ర గురించి అప్పట్లోనే చెప్పానని, ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో చంద్రబాబు, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పాత్ర ఉందని ఆరోపించారు.