బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. భర్తను బెదిరించి మరీ, ప్లాట్ఫాంపైనే అతని భార్యపై గ్యాంగ్ రేప్ చేశారు. ఎర్రగొండ పాలెం నుంచి తాపీ పనుల కోసం దంపతులు నాగాయలంకకు వెళ్తున్నారు. అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్లో దిగారు. అక్కడి నుంచి బస్సులో వెళ్లాలని దంపతులు అనుకున్నారు.
అయితే రాత్రి సమయం కావడంతో దంపతులు రేపల్లె రైల్వే ప్లాట్ఫామ్పైనే నిద్రించారు. దంపతులు నిద్రించిన తర్వాత అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. భర్తను బెదిరించారు. ఆపై దాడి చేసి, భార్యపై సామూహిక అత్యాచారం చేశారు.
స్పందించిన సీఎం జగన్.. జిల్లా ఎస్పీకి ఫోన్
రేపల్లెలో జరిగిన గ్యాంగ్ రేప్పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్తో ఫోన్లో మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఎస్పీని ఆదేశించారు.