అమరావతి : దివంగత నేత, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు టీడీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ పేరిట ఆలయంలో పూజలు నిర్వహించి మాట్లాడారు. నిమ్మకూరులో 30 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా రూపు దిద్దుతామని ప్రకటించారు.
తెలుగు జాతీ ఉన్నంతవరకు ఎన్టీఆర్ చిరస్మరణీయుడిగా కొనసాగుతారని అన్నారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అన్ని తరాలుకు ఆదర్శప్రాయుడని తెలిపారు. తెలుగు జాతికి విశ్వరూపమని అన్నారు. ఆయన శకపురుషడని పేర్కొన్నారు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు.