హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన భర్త నాలుకను కొరికేసిందో ఇల్లాలు. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్ కర్నూల్ జిల్లా తుగ్గలి మండలానికి చెందిన పుష్పవతిని 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. శుక్రవారం ఉదయం కూడా ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
బలవంతంగా ముద్దు పెట్టేందుకు యత్నించిన తారాచంద్ను పుష్పవతి గట్టిగా కొరికేసింది. నాలుక తెగిపడి తీవ్ర రక్తస్రావడంతో బాధితుడిని స్థానికులు దవాఖానకు తరలించారు. తన కు బలవంతంగా ముద్దు పెట్టబోయినందుకే ఇలా జరిగిందని పుష్పవతి పోలీసులకు ఫిర్యా దు చేసింది. తన భార్యకు పుట్టినింటి ఊరిలో ఎఫైర్ ఉందని, సర్దుకు పోతున్నా తనను చంపేస్తుందేమోనని తారాచంద్ వాపోయాడు.