అమరావతి : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 95 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన బులిటిన్ లో వెల్లడించారు. ప్రసుత్తం ఏపీలో 1, 432 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 20లక్షల 60వేల మంది బాధితులు కోలుకున్నారని చెప్పారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26, గుంటూరులో 15 మంది కరోనా బారిన పడ్డారని వెల్లడించారు.