అమరావతి : ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి జరిపి రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం విధించిన నిషేధం ఏపీకి వర్తించదని ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. పవర్ ఎక్సేంజ్ ద్వారా కొనుగోలులో ఏపీకి బకాయిలు లేవని స్పష్టం చేశారు. ఏపీ డిస్కమ్లు కూడా ఇప్పటికే కేంద్రానికి రూ. 350 కోట్లు చెల్లించేశాయని పేర్కొన్నారు. సమాచారం లోపం వల్లే ఏపీ పేరును జాబితాలో చేర్చారని ఆయన వెల్లడించారు.