అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాప ప్రకటించారు. సమర్థుడైన అధికారిగా, స్నేహశీలిగా ఎస్వీ ప్రసాద్ పేరు తెచ్చుకున్నారని అన్నారు. వృతి పట్ల నిబద్ధత కలిగిన అధికారిగా అందరి మన్ననలు పొందారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఓ అధికారిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఎస్వీ ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ తన సానుభూతి తెలిపారు.
మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ అకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు. అంకితభావంతో విధులు నిర్వహించిన ఎస్వీ ప్రసాద్ అందరి మన్ననలు అందుకున్నారని అన్నారు. ప్రసాద్ కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు.