అమరావతి : కృష్ణా జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.ముదినేపల్లి మండలం చేవూరుపాలెం సెంటర్లో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా అతి వేగంగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కలిదిండి గ్రామానికి చెందిన నాగరాజు, నాని అనే యువకులు మృతిచెందారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.