అమరావతి : విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నడిచివెళ్తున్న వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన జిల్లాలోని భోగాపురం మండలంలోని సవరవిల్లి పంచాయతీ అవ్వపేట జాతీయ రహదారిపై చోటు చేసుకుంది . సవరవిల్లి గ్రామంలో జరుగుతున్న బంగారమ్మతల్లి ఉత్సవానికి వరుసకు బావ, బామ్మర్దులైన డెంకాడ మండలం బంగార్రాజుపేటకు చెందిన కొల్లి వీరబాబు, విజయవాడకు చెందిన కె.ఈశ్వరరావు కలిసి వచ్చారు. వీరిద్దరూ అవ్వపేటలో ఉంటున్నారు.
వీరబాబు వృత్తిరీత్యా సంతలకు వెళ్లి మేకల అమ్మడంతో పాటు, మాంసం వ్యాపారం చేస్తుంటారు. గ్రామంలో పండగ సందర్భంగా మేకపోతులు కొట్టేందుకు కత్తి కోసమని మంగళవారం రాత్రి ఇద్దరూ ద్విచక్రవాహనంపై బంగార్రాజుపేట బయలుదేరారు. పోలిపల్లి వద్ద వంతెన దాటుతుండగా ఎదురుగా నడిచివెళ్తున్న వ్యక్తిని బలంగా వాహనంతో ఢీకొట్టడంతో వారిద్దరూ డివైడర్పై ఎగిరిపడి అక్కడికక్కడే చెందారు.
నడిచివెళుతున్న తగరపువలస గ్రామానికి చెందిన కోరాడ రమణ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.