East Godavari | వివాహ వేడుకల్లో (Wedding Function) చిన్న చిన్న గొడవలు చోటు చేసుకోవడం సర్వసాధారణమే. కట్నకానుకల విషయం, మర్యాదలు సరిగా చేయలేదనో, భోజనాలు బాగోలేవనో ఇరు కుటుంబ సభ్యులు మాటామాటా అనుకుంటుంటారు. అయితే ఓ వివాహ వేడుకలో చోటు చేసుకున్న వివాదం మాత్రం కొట్లాటకు దారితీసింది. విచిత్రం ఏంటంటే పెళ్లి కుమార్తె డ్యాన్స్ చేయకపోవడం ఈ వివాదానికి కారణమైంది.
వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి (East Godavari ) జిల్లా సీతానగరం (Seethanagaram) మండలం రామచంద్రపురంలో సోమవారం సుబ్రహ్మణ్యం, పూజితల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం కోసం పెళ్లి కుమార్తె బంధువులంతా తాళ్లపూడి మండలం గజ్జరం నుంచి రామచంద్రపురానికి విచ్చేశారు. వివాహ తంతు అనంతరం అంతా భోజనాలు చేస్తున్నారు. ఆ సమయంలో కొత్త జంట డ్యాన్స్ చేయాలంటూ అక్కడున్న బంధువులు పట్టుబట్టారు. అయితే, వధువు తరఫు బంధువులు మాత్రం అందుకు నిరాకరించారు. ఆడపిల్ల డ్యాన్స్ చేయడమేంటి అంటూ ప్రశ్నించారు.
ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో వరుడి కుటుంబ సభ్యులు వధువు తరఫు బంధువులపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళకు తల పగిలింది. మరో వ్యక్తి చేయి విరిగింది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
thiruchanur | ఐదు రోజుల పాటు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
India Corona | 24 గంటల్లో 656 కొత్త కేసులు.. 12 మరణాలు
Amazon Layoffs | అమెజాన్లో 9 వేల మందిపై వేటు.. భారత్లో 500 మందిపై లేఆఫ్స్ ప్రభావం