తిరుమల: శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లు మంగళవారం ఆన్లైన్లో విడుదల కానున్నాయి. జనవరి, ఫిబ్రవరి కోటాకు సంబంధించిన టికెట్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ (TTD) విడుదల చేయనున్నది. జనవరి 1న వెయ్యి బ్రేక్ దర్శన టికెట్లు (రూ.500), 13న వైకుంఠ ఏకాదశి రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్లు (రూ.300) విడుదల చేస్తారు. జనవరి 14 నుంచి 22 వరకు రోజుకు 2 వేల చొప్పున లఘు దర్శన టికెట్లు (రూ.500), జనవరి, ఫిబ్రవరి నెలల్లోని మిగతా రోజుల్లో బ్రేక్ దర్శన టికెట్లు కూడా విడుదల కానున్నాయి.
సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున బ్రేక్ దర్శన టికెట్లు (రూ.500), శని, ఆదివారాల్లో 300 చొప్పున శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన (రూ.500) టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు.