సినీ క్రిటిక్, బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి కొద్ది రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులకి భావోద్వేగాన్ని కలిగించింది. కత్తి అంత్యక్రియులు ఆయన సొంత ఊరు చిత్తూరు జిల్లా యలమంద గ్రామంలో సోమవారం జరిగాయి. ఆయనకు నివాళులర్పించేందుకు జనాలు భారీ స్థాయిలో తరలి వచ్చారు.
కత్తి మహేష్ కడసారి చూపు కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ మాల/మాదిగ నేతలందరు వచ్చారు. ముఖ్యంగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రెల్లి కార్పోరేషన్ ఛైర్మన్ మధుసూదన్ రావు కూడా కత్తి మహేష్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కత్తి మహేష్ ను కాపాడుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారని మాట్లాడారు. అలాగే మహేష్ కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయని, వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి తీరాలని మందకృష్ణ మాదిగ తీవ్రంగా డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆయనకు ఆక్సిజన్ తీసేసారని వార్తలు వస్తున్న నేపథ్యంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.