అమరావతి : ఉత్తరాఖండ్ ( Utterakhand State ) రాష్ట్రంలోని తెహ్రి జిల్లా గులార్ వద్ద నదిలో విజయనగరం వాసి దుర్మరణం చెందాడు. 11 మందితో కూడిన పర్యాటకుల వాహనం (Tourist Vehicle )నదిలో కొండ సమీపం నుంచి వెళ్తుండగా అక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో వాహనం నడుతుపున్న వ్యక్తి ఒక్కసారిగా వాహనాన్ని మలుపుతిప్పడంతో బోల్తా పడింది.
11 మందిలో ఐదుగురిని విపత్తు నిర్వహణ బృందం సభ్యులు రక్షించగా మరో ఆరుగురు గల్లంతయ్యారు. బాధితుల్లో విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాంకు చెందిన దంపతులు రవి రంగారావు ఉన్నారు. వీరిలో భార్యను రక్షించగా భర్త రవిరావు నదిలో గల్లంతయ్యారు.