అమరావతి : ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులోని కటాఫ్ ఏరియా హంతల్గూడ ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. అల్లూరి జిల్లా సరిహద్దులోని చిత్రకొండ నుంచి జడంబోకు సిమెంట్ లోడు, ఇనుప రాడ్లతో వెళ్తున్నారు.
ప్రమాద సమయంలో టిప్పర్పై 16 మంది కూలీలు కూడా ఉన్నారు. ఘాట్ రోడ్డు వద్ద టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడగా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసి జోడాంబో ఆసుపత్రికి తరలించారు. బాధితులు నవరంగపూర్ జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.