అమరావతి : అనంతపురం గ్రామీణ మండలం ఆలమూరులో విషాదం నెలకొంది. రాత్రి మద్యం తాగిన ముగ్గురు వలస కూలీలు మృతి చెందారు. మహారాష్ట్రలోని సౌలాజీ గ్రామానికి చెందిన ముగ్గురు కూలీలు ద్రాక్షతోటలో పని కోసం వచ్చారు. రాత్రి ముగ్గురు మద్యం తెచ్చుకుని తాగగా ఒకరు భరత్ నామ్దేవ్ చౌహన్ రాత్రి తోటలోనే మృతి చెందగా ఇవాళ ఇద్దరు దీపక్ జయ్సింగ్తో పాటు మరొకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు.