అమరావతి : ఏపీలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో ముగ్గురు కర్ణాటక వాసులు మృతి చెందారు. మార్కాపురం జిల్లా తిప్పాయపాలెం వద్ద అరటికాయల లోడుతో వెళ్లున లారీ, జీపును ఢీకొంది. దీంతో జీపులో ఉన్న కర్ణాటకకు చెందిన ముగ్గురు మృతి చెందారు. వీరంత శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.