తిరుపతి : తిరుపతిలో రెండు రోజుల పాటు జరిగిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య కళామందిరంలో సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఎంఆర్.పల్లి సర్కిల్ వద్దగల వెంగమాంబ విగ్రహానికి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ ఆధ్వర్యంలో పుష్పాంజలిని నిర్వహించారు.
అన్నమాచార్య కళామందిరంలో పి.శ్రీనివాసకుమార్, ఆర్.శ్యాంకుమార్ బృందం సంగీత సభ నిర్వహించారు. సీతాలక్ష్మి హరికథ వినిపించారు. ఈ కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డా.సి.లత తదితరులు పాల్గొన్నారు.