అమరావతి : ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ చేపట్టిన రైతుల మహాపాదయాత్ర ఇవాళ 18 వ రోజుకు చేరుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి నుంచి ప్రారంభమైన యాత్ర కు జనాలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు . ఈ యాత్ర ఇవాళ శ్రీరామవరం మీదుగా పెరుగు గూడెం వరకు కొనసాగనుంది . జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. వంగాయగూడెంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా యాత్రలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి మెప్పు కోసం తమపై వైకాపా నేతలు నోరుపారేసు కుంటున్నారని రైతులు ఆరోపించారు. తామంతా అమరావతే శ్వాసగా ముందుకు కదులుతామని తేల్చి చెప్పారు. టీడీపీ నాయకులు మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్తో పాటు పలువురు సంఘీభావం తెలిపారు పాదయాత్రకు స్పందన ఓర్వలేకే మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.