అమరావతి : సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలు సాధికారత సాధించాలని, బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలన్నదే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్కల్యాణ్( Pawan Kalyan) పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం నిర్వహించిన బీసీ డిక్లరేషన్ (BC Declaration ) సభలో ఆయన మాట్లాడారు.
బీసీలు ఐక్యంగా లేకపోవడం వల్లే హక్కులు పొందలేకపోతున్నామని, వైసీపీ (YCP) వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి కూటమికి బలం అందించాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో 3 వందల మంది బీసీలను పొట్టన పెట్టుకున్నారని, లక్షల మంది బీసీ కార్మికుల ఉపాధిని నాశనం చేశారని ఆరోపించారు. వెన్నంటి ఉన్న బీసీలనే జగన్ దెబ్బ కొట్టారని విమర్శించారు.
జగన్ అధికారంలోకి రావడానికి బీసీలకు అనేక హామీలు ఇచ్చారని, బడ్జెట్లో మూడోవంతు బీసీలకే అని ప్రకటించి పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. వైసీపీలో ఉన్న బీసీ నేతలు ఆలోచించుకోవాలని సూచించారు. బీసీలకు రక్షణ చట్టం ఎంతో అవసరమని, అందుకే మద్దతు తెలుపుతున్నానని అన్నారు.