తిరుపతి : తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్డ్ బియ్యం టెండర్ కమ్ వేలాన్ని ఈనెల 11న తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. మొత్తం 3,600 కిలోల బియ్యాన్ని వేలానికి సిద్ధంగా ఉంచామని, రూ.118/- డిడి తీసి టెండరు షెడ్యూల్ పొందొవచ్చని సూచించారు.
వేలంలో పాల్గొనేందుకు రూ.25వేలు ఇఎండీగా చెల్లించాలని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్వారి కార్యాలయాన్ని గాని 0877-2264429 ఫోన్ నంబరులో గాని సంప్రదించాలని తెలిపారు .