బెంగళూరు: రాజమహేంద్ర వరం నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో తిరుపతి వెళ్లకుండా ఈ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. ఇండిగో సంస్థకు చెందిన విమానంలో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రేణిగుంటకు వెళ్లాల్సిన విమానం దారి మళ్లించారు. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే, నటి రోజా సహా సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు.