అమరావతి : ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ అభ్యర్థుల ( Rajya Sabha Candidates ) స్థానాలకు కూటమి పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశాయి. ఇప్పటికే జనసేన పార్టీ తరుపున లింగమనేని రమేశ్ పేరును ఖరారు చేయడంతో శనివారం నామినేషన్ దాఖలు చేశారు.
కాగా టీడీపీ నుంచి సానా సతీశ్( Sana Satish ), భాష్యం రామకృష్ణ ( Rama Krishna ), చింతకాయల విజయ్ ( Vijay ) పేరును పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేసి పేర్లను ప్రకటించారు. భాష్యం రామకృష్ణ 2014 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఆశించి భంగ పడ్డారు. దీంతో ఆయనకు ఈసారి రాజ్యసభ అవకాశాన్ని కల్పించారు. ఇక చింతకాయల విజయ్ తండ్రి అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్గా కొనసాగుతున్నారు.
పార్టీలో సీనియర్ వర్ల రామయ్య పేరును చివరివరకు పరిశీలించిన చంద్ర బాబు చివరకు విజయ్ వైపు మొగ్గుచూపారు. సతీశ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రస్తుతం పనిచేస్తున్నా ఇంకా ఏడాదిన్నర మాత్రమే పదవికాలం ఉండడంతో ముందుగానే అతడిని సామాజిక సమీకరణల్లో భాగంగా ఆయన పేరును ఖరారు చేశారు. టీడీపీ అభ్యర్థులంతా సోమవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.