అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శనివారం ధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. బస్టాండ్ల వద్ద బస్సులను అడ్డుకున్నారు. పలు సెంటర్లలో రాస్తారోకోకు దిగారు. ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు నాయకులు, కార్యకర్తలు, బైఠాయించారు.
గన్నవరం మండలం బస్టాండ్లో టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ధర్నాకు దిగారు. బస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇదే విషయమై కడప బస్టాండ్లో టీడీపీతోపాటు ఇతర పార్టీల నేతలు బైఠాయించారు. ఇక్కడ కూడా ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్స్టేషన్కు తరలించారు.
కడప జిల్లా పులివెందులలో ఇతర పార్టీల నేతలతో కలిసి టీడీపీ ఆందోళనకు దిగారు. బస్టాండ్ వద్ద ధర్నాకు దిగిన వీరిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అదేవిధంగా కృష్ణా జిల్లా, అన్నమయ్య జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో కూడా టీడీపీ నేతలు ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.