Pawan Kalyan | పిఠాపురంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పొత్తులో భాగంగా అక్కడి నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తల్లో అసమ్మతి బయటపడింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మకు కాకుండా జనసేనకు టికెట్ కేటాయించడం పట్ల ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిఠాపురం టికెట్ను చంద్రబాబు నాయుడు జనసేనకు కేటాయించడం పట్ల టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో పిఠాపురం టికెట్ను మాజీ ఎమ్మెల్యే వర్మకే కేటాయించాలని ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలోని టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. పిఠాపురం టికెట్ను వర్మకే ఇవ్వాలని ఈ సందర్భంగా అల్టిమేటం జారీ చేశారు. టీడీపీకి కాకుండా ఎవరు పోటీ చేసినా సరే సపోర్ట్ చేయబోమని తేల్చిచెప్పారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని.. కచ్చితంగా తమే ఓడగొడతామని టీడీపీ కార్యకర్తలు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ ) కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన కాసేపటికే వర్మ ఈ మేరకు ట్వీట్ చేయడం విశేషం.
పిఠాపురంలో @JaiTDP @JanaSenaParty పొత్తు పాంప్లెట్లను తగలపెట్టిన టీడీపీ నాయకులు. పిఠాపురంలో @PawanKalyan ని ఓడించి తీరుతాం అని జనసేన నాయకులకి సవాల్ విసిరిన టీడీపీ నాయకులు. #TDPJSPCollapse pic.twitter.com/OWpEwgJgTC
— YSR Congress Party (@YSRCParty) March 14, 2024