ఏపీ మంత్రివర్గ కూర్పుపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ నూతన కేబినెట్ ఛాయ్, బిస్కట్ కేబినెట్ అంటూ ఎద్దేవా చేశారు. గత మంత్రివర్గం పప్పెట్ కేబినెట్ అయితే.. ఇప్పుడున్నది ఛాయ్, బిస్కెట్ కేబినెట్ అని విమర్శించారు. యనమల రామకృష్ణుడు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కొత్త కేబినెట్పై విమర్శలు చేశారు.
జగన్ కేబినెట్లోని మంత్రులకు స్వేచ్ఛ లేదని అన్నారు. సీఎం కిచెన్ కేబినెట్లో గానీ, సలహాదారుల బృందంలో గానీ బీసీలు ఎందుకు లేరని నిలదీశారు. టీడీపీ ఆవిర్భావంతోనే బీసీలకు ప్రాధాన్యత వచ్చిందని, ప్రాతినిధ్యం కూడా అప్పుడే వచ్చిందని చెప్పుకొచ్చారు. వైసీపీలో అసంతృప్తి మొదలైపోయిందని, సీఎం జగన్పై నేతలు తిరగబడుతున్నారని యనమల విమర్శించారు.