విజయవాడ: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు అక్కడే ఆయన్ను అరెస్టు చేశారు. భారీ బందోబస్తు మధ్య పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో భర్త భద్రతపై పట్టాభి భార్య ఆందోళన వ్యక్తం చేశారు.
తన భర్తకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని ఆమె అన్నారు. మంగళవారం ఉదయం నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత నక్కా ఆనంద్బాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పోలీసుల తీరును తప్పుబట్టిన పట్టాభి.. సీఎం జగన్ను దుర్భాషలాడారు. అదే రోజు సాయంత్రం పట్టాభి సహా పలువురు టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలపై దుండగులు దాడి చేశారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంపై కూడా దాడి జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల జరిగిన ఈ దాడులకు అధికార పార్టీనే కారణమంటూ టీడీపీ వర్గాలు ఆరోపించాయి.