Constable | ఏపీలోని కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షిణిస్తున్నాయి. అధికారం అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. తాజాగా పోలీస్ కానిస్టేబుల్పై టీడీపీ నాయకుడు దాడికి( Attacks police constable) పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..ర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం వెల్దుర్తి జెడ్పీ హైస్కూల్ మైదానంలో ఇంకుడు గుంత నిర్మాణంపై ఫిర్యాదు అందుకుని వచ్చిన పోలీసులపై టీడీపీ నాయకుడు (TDP leader) శ్రీనివాసులు గౌడ్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఎస్ఐకి ఫోన్ చేసి.. తిరిగి మీ మీదనే కేసు పెడతాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా, నిన్న శ్రీకాళహస్తిలో కానిస్టేబుల్పై దాడి చేసిన యువకులను రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు.. ఇప్పుడు టీడీపీ నాయకుడిపై కూడా అదే స్థాయిలో చర్యలు తీసుకుంటారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
పోలీస్ కానిస్టేబుల్పై టీడీపీ నాయకుడు దాడి
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం వెల్దుర్తి ZP హైస్కూల్ మైదానంలో ఇంకుడు గుంత నిర్మాణంపై ఫిర్యాదు అందుకుని వచ్చిన పోలీసులపై టీడీపీ నాయకుడు శ్రీనివాసుల గౌడ్ దాడి
అనంతరం ఎస్ఐకి ఫోన్ చేసి.. తిరిగి మీ మీదనే కేసు పెడతాను అంటూ బెదిరించిన… https://t.co/FwPnVMyEwZ pic.twitter.com/ax1Sd2zAW6
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026