అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని మావోయిస్టు మిలీషియా సభ్యులు అల్లూరి జిల్లా ఎస్పీ సతీశ్కుమార్ ఎదుట బుధవారం 33 మంది మిలీషియా సభ్యులు, ఒకరు మావోయిస్టు దళ సభ్యురాలు భారతి లొంగిపోయారు. గతంలో ప్రభుత్వం భారతిపై లక్ష రూపాయలు రివార్డు ప్రకటించిందని తెలిపారు. లొంగిపోయిన మిలిసియ సభ్యులకు పునరావాస చర్యలు చేపడతామని వెల్లడించారు. లొంగిన వారి నుంచి మైనింగ్ డిటోనేటర్లు, తపంచా, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.