అమరావతి : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో అనే అంశం ఏపీ సీఎం జగన్దే తుది నిర్ణయమని ఎంపీ విజయ సాయిరెడ్డి వెల్లడించారు. ఎన్డీయే అభ్యర్థిగా ఎస్టీకి చెందిన మహిళ పేరును ఖరారు చేయడాన్ని ఆయన స్వాగతించారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారని పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు. మూడు రాజధానుల వ్యవహారంపై ఆయన స్పందించారు. విశాఖలోనే పరిపాలన రాజధాని వుంటుందని, ఎవరు ఆపినా ఆగదన్నారు. కాలువలు, చెరువులు, నదులు ఆక్రమించే హక్కు ఎవరికీ లేదని టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు చెరువు కాలువ కబ్జాపై మాట్లాడారు. హైకోర్టులో అయ్యన్నకు తాత్కాలికంగా స్టే ఇచ్చినా అది తాత్కాలికమేనని అన్నారు.