అమరావతి : జీవితపై విరక్తి చెందిన ఓ కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా(Kurnool district) ఆదోని రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. తమిళనాడు(Tamilnadu)కు చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు తండ్రి, భార్య, కూతురు ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య(Suicide)కు ప్రయత్నించారు.
గమనించిన రైల్వే పోలీసులు(Railway police) వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో తండ్రి పద్మనాభం, భార్య సెల్వి, కుమార్తె జీవితకు గాయాలయ్యాయి. వీరికి మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూలులోని ఆస్పత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.