అమరావతి : ఏపీలో విషాదం చోటు చేసుకుంది. కాకినాడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఫీజు కట్టలేదని అవమానించడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అరవింద్(15)ను ఫీజు కట్టలేదని క్లాస్ రూమ్లో అందరి ముందు కాలేజీ సిబ్బంది నిలదీసి ఇంటికి పంపించారు.
అది చూసి కొందరు నవ్వుకోవడంతో, అవమానాన్ని భరించలేక అరవింద్ శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిబ్బంది వేధింపుల వల్లే అరవింద్ చనిపోయాడని తల్లిదండ్రులు, బంధువులు కాలేజీపై దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.