అమరావతి : దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ దర్శనానికి వెళ్లిన ఏపీకి చెందిన ఆరుగురు భక్తులు గాయపడ్డారు. నిన్న ఆకస్మాత్తుగా వరద బీభత్సంతో పలువురు మృతి చెందగా మరి కొంతమంది గల్లంతైన విషయం తెలిసిందే. కాగాఈ ఘటనలో ఇంకొంత మంది గాయపడ్డారు.
గాయపడ్డ 16 మందిని స్థానిక పోలీసులు శ్రీనగర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారుగా గుర్తించి వారిపేర్లను వెల్లడించారు. తేజ్లక్ష్మి , కె. విజయలక్ష్మి, టీ. రమణ, శ్రీనివాస్ ,మార్కండేయులు, రాజ్ భానియా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారని వివరించారు.