అమరావతి : దేవతామూర్తుల మూలవిరాట్టును ఫోటో, వీడియో తీయరాదని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ పలు దేవాలయాలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తు అపచారానికి పాల్పడుతున్నారు. తాజాగా మరోసారి విశాఖ(Visaka) జిల్లాలోని సింహాచలం(Simhachalam) అప్పన్నస్వామి ఆలయంలో స్వామి నిజ రూపదర్శనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వీడియో(Video Share) తీసి షేర్ చేయడం కలకలం రేపుతుంది.
ఎంతో పవిత్రంగా కొలిచే స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు ఏడాది పాటు వేచి చూస్తూ అక్షయ తృతీయ నాడు ఒక్క రోజు మాత్రమే లభించే స్వామి నిజరూపదర్శనానికి భక్తులు(Devotees) పెద్ద సంఖ్యలో ఆలయానికి నియమ, నిష్ఠాలుంటూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అయితే అప్పన్న స్వామివారి నిజరూప దర్శనం(Real Appearance) బయటకు రావడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
గత ఏడాది కూడా ఇలాంటి అపచారమే జరిగినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే మరోసారి కొందరు స్వామివారి గర్భాలయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఘటనను మర్చిపోకముందే ఇప్పుడు ఏకంగా స్వామివారి నిజరూపాన్ని వీడియో తీసి పోస్టు చేయడం ఆలయంలోని భద్రతాలోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల చందనోత్సవంలో కూడా సౌకర్యాల కొరతతో భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి లైన్లో నిలబడి స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారు.