అమరావతి : వివిధ సంస్థల నుంచి రావాల్సిన మొండి బకాయిల వసూళ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా దృష్టిని సారించింది . అవసరమైతే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు రావడంతో అధికారులు సైతం ఏ మాత్రం బెదరకుండా బకాయి సంస్థలపై చర్యలు తీసుకుంటు న్నారు. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్కు బకాయి పడ్డ కడప ఆర్టీసీ బస్టాండ్కు అధికారులు ఇవాళ తాళాలు వేసి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఉదయం నుంచి బస్టాండ్లోకి బస్సులు రాకుండా ఆపేశారు. కార్పొరేషన్కు బకాయిలు చెల్లించాలని అనేకమార్లు ప్రత్యుత్తరాలు జరిపినా ఫలితం లేకపోవడంతో బస్టాండ్కు తాళాలు వేయవలసి వచ్చిందని కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. బస్టాండ్కు తెల్లవారుజామున 4 గంటలకు తాళాలువేయడం వల్ల ప్రయాణికులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ముఖ్యమంత్రి, ఆర్టీసీ స్టేట్ చైర్మన్ సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి రావడం పట్ల ప్రయాణికులు విస్మయం చెందుతున్నారు. కడప పాత బస్టాండ్ను నగరపాలక అధికారులు నిర్మించారు. అక్కడ ఆర్టీసీ బస్సులను పార్కింగ్ చేసేందుకు ప్రతినెల ఆర్టీసీ అధికారులు నగరపాలక సంస్థకు అద్దె చెల్లిస్తున్నారు.ఈ బకాయిలు సుమారు రెండుకోట్లకు పైగా పేరుకుపోవడంతో మున్సిపల్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.