అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనారాయణకు హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ నైఫుణ్యాభివృద్ధి సంస్థలో పనిచేసిన సమయంలో నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో సీఐడీ గత నాలుగురోజుల క్రితం లక్ష్మీనారాయణ ఇంటిపై దాడులు చేసింది. అతడి ఇంటి నుంచి విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని కోర్టుకు విచారణ హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.
\నోటీసుల ప్రకారం లక్ష్మీనారాయణ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా సోమవారం కోర్టు 15 రోజుల పాటు మద్యంతర బెయిల్ను మంజూరు చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే ముంభై, పుణెకు చెందిన పలు షెల్ కంపెనీలకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించింది.