అమరావతి : వివిధ నేరారోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డికి తెలంగాణ హైకోర్టు నుంచి ఊరట లభించింది . సీబీఐ కోర్టులో రోజువారీ విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్కు మినహాయించింది . రోజువారీ విచారణకు హాజరుకావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది . తన బదులు న్యాయవాది హాజరుకు అనుమతివ్వాలన్న జగన్ అభ్యర్ధనకు అంగీకారం తెలిపింది . సీబీఐ కోర్టు తప్పనిసరి అన్నప్పుడు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది .