అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నిర్వహించిన పాలిసెట్-2022 పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజయవాడలోని గేట్ వే హోటల్లో ఫలితాలను విడుదల చేశారు. 2022-23 విద్యాసంవత్సరానికి గాను మే 29న రాష్ట్రవ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్ ప్రవేశపరీక్షలను నిర్వహించారు.
లక్షా 37,371 మంమది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా లక్షా 25 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల్లో 91.84 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని మంత్రి పేర్కొన్నారు. బాలురు 90.56 శాతం, బాలికలు 93.96 శాతం ఉత్తీర్ణత సాధించి బాలురపై అధిక్యత సాధించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.